ఉప్పల్, ఫిబ్రవరి 2 : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. గురువారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని చిన్న చర్లపల్లిలో మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.27లక్షల నిధులతో ఆధునీకరించిన మోడల్ పాఠశాలను స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, డీఈఓ విజయ కుమారితో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించడంతో పాటు మెరుగైన విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని ఇరువై పాఠశాలలను గుర్తించి ఆధునీకరించడంతో పాటు రెండు పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 176 పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు సుమారు రూ.76కోట్ల నిధులు ప్రభుత్వం కేటాయించిందని ఆయ న గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కావల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నామని, విద్యార్థులకు మెరుగైన విద్యను అందించి.. ఉత్తమ ఫలితాలను సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన సూచించారు. అనంతరం కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, డీఈఓ విజయకుమారి, ఎంఈఓ శశిధర్లు ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు నందిని, డీఈ రవీందర్గౌడ్, అధికారులు రవీందర్రాజు, అయ్యన్న, శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి ధన్పాల్ రెడ్డి, నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, గరిక సుధాకర్, డప్పు గిరిబాబు, ప్రభాకర్రెడ్డి, పద్మారెడ్డి, బొడిగె ప్రభుగౌడ్, నారెడ్డి రాజేశ్వర్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, కొమ్ము సురేశ్, కడియాల బాబు, రాజుగౌడ్, గంప కృష్ణ, సత్తిరెడ్డి, ఉపేందర్, మల్లారెడ్డి, శ్యామ్, పుష్పలత, ఆయూబ్తో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.