హయత్నగర్ : సీఎం సహాయ నిధితో ఎంతో మంది పేదలకు లబ్ధి చేకూరుతుందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మన్సురాబాద్ డివిజన్ వీరన్నగుట్టకు చెందిన నాగేంద్రచారి కుటుంబానికి ఎమ్మెల్యే సుధీర్రెడ్డి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన లక్ష రూపాయల చెక్కును అందజేశారు.
బాధితుడు తీవ్ర మోకాళ్ల ప్పితో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరాడు. అందుకు వైద్య ఖర్చులకు సీఎం సహాయ నిధి కింద లక్ష రూపాయలకు ఎల్ఓసీ చెక్కును ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మంజూరు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆరోగ్య పరిరక్షణకు సీఎం సహాయనిధి దోహదపడుతుందని తెలిపారు.
నిరుపేదలకు ఈపథకం వరం లాంటిదన్నారు. ప్రజలకు నాణ్యమైన ఆధునాతన వైద్య సేవలను పొందేందుకు సీఎం సహాయ నిధి అండగా ఉంటుందని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అనంతుల రాజిరెడ్డి, కాటెపాక స్కైలాబ్, రాకేష్, ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.