ఉప్పల్, జూన్ 23: సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి సూచిం చారు.హబ్సిగూడలోని గాంధీగిరిజనబస్తీలో సీజనల్ వ్యాధులపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుభాష్రెడ్డి, జోనల్ కమిషనర్ పంకజ, హబ్సిగూడ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీశ్ హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలం నేపథ్యంలో పరిసరాలు పరిశుభ్రంతో పాటు దోమలు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దోమల వృద్ధి, నివారణ చర్యలు, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అరుణకుమారి, సీనియర్ ఎంటమాలజిస్టు రజిని, నరేశ్రెడ్డి, ఈఈ నాగేందర్, డీఈ నాగమణి, ఏఈ కీర్తి, నేతలు లక్ష్మారెడ్డి, సుధాకర్, కుమారస్వామి, సోమిరెడ్డి, శివ, శంకర్, లింగానాయక్, యాకాంతరావు,శ్రీధర్, రవినాయక్, అక్బర్,వెంకటసాయి, నరేందర్, చందు, మహబూబీ, భాగ్యలక్ష్మి, భాగ్యరేఖ, ధనలక్ష్మి, యాదమ్మ పాల్గొన్నారు.
పట్టణ ప్రగతిపై సమీక్షా సమావేశం
ఉప్పల్ మున్సిపల్ కార్యాలయంలో గురువారం పట్టణ ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులతో ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతిలో భాగంగా గుర్తించిన సమస్యలు, రూపొందించిన ప్రణాళికలపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు సిద్ధ్దం చేయాలని ఆదేశించారు. నాలా ల పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్సీ పంకజ, డీసీ అరుణకుమారీ, ఈఈ నాగేందర్, జలమండలి జీఎం జాన్షరీఫ్, ఎలక్ట్రికల్ డీఈ సాయిప్రసాద్, టౌన్ప్లానింగ్ ఏసీపీ వెంకటరమణ, టీపీఎస్ మౌనిక, ప్రా జెక్టు ఆఫీసర్ రమాదేవి, అధికారులు, సిబ్బంది ఉన్నారు.
ఎల్లమ్మ కల్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ఉప్పల్లోని ఇందిరానగర్కాలనీలో రేణుకా ఎల్లమ్మ జమదగ్ని కల్యాణ మహోత్సవం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుభాష్రెడ్డి హాజరైనారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో నాగరాజు, శివమ్మ, యాదగిరి, సాక్షి, మోక్షిత్, రాజు, నేతలు సుధాకర్, వీరేశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన దూదేకుల సంఘం ప్రతినిధులు
ఉప్పల్కు చెందిన నూర్భాషా దూదేకుల ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు గురువారం హబ్సిగూడలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే సుభాష్రెడ్డిని కలిశారు. అసోసియేషన్కు స్థలం కేటాయించాలని, కమ్యూనిటీహాల్ నిర్మించేలా చూడాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్పార్టీ అధ్యక్షుడు సంతోష్రెడ్డి, నేతలు అల్లాబాషా, నాగూ ర్ భాష, హుస్సేన్, జానయ్య, మస్తాన్, బాబు, వీరయ్య, రోశయ్య, ఖాసీంవలి పాల్గొన్నారు.
దళితుల అభివృద్ధి కోసమే దళితబంధు
మల్లాపూర్/కాప్రా, జూన్ 23: సమాజంలోని దళితులందరూ అభివృద్ధిచెందాలన్న కేసీఆర్ ఆశయసాధనకు దళితబంధు లబ్ధ్దిదారులు కంకణబద్ధ్దులై అభివృద్ధిపథంలో ముందుకు సాగాలని ఎమ్మెల్యే బేతిసుభాష్రెడ్డి అన్నారు. కాప్రా డివిజన్ చంద్రపురికాలనీకి చెందిన సుంకరి సుశీల్కు, మల్లాపూర్ డివిజన్కు చెందిన రాపోలు శ్రీనివాస్కు దళితబంధులో భాగంగా కారు మంజూరు కావడంతో ఆయనకు కార్పొరేటర్ దేవేందర్రెడ్డి, జోనల్కమిషనర్ పంకజతో కలిసి ఎమ్మెల్యే కారు తాళం చెవి అందజేశారు. కార్యక్రమంలో కాప్రాడివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మహేందర్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ
రామంతాపూర్, జూన్ 23 : రామంతాపూర్ జడ్పీ స్కూల్లో ఉప్పల్ టీఆర్ఎస్వీ ప్రధాన కార్యదర్శి బత్తిని ప్రశాంత్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే బేతిసుభాష్రెడ్డి హాజరై విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు.కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సాంబయ్య, టీఆర్ఎస్ నా యకులు సుధాకర్,రాజు,శివ,కృష్ణ పాల్గొన్నారు.
గుర్రపు డెక్క తొలగింపు పనులు పరిశీలన
రామంతాపూర్ పెద్ద చెరువులో ఎఫ్టీసీ మిషన్తో చేపట్టిన గుర్రపు డెక్క తొలగింపు పనులను ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి జోనల్ కమిషనర్ పంకజతోకలిసి దోమల లార్వా నివారించే ఎంఎల్ఓ ఆయిల్ స్ప్రేను గురువారం పరిశీలించారు.కార్యక్రమంలో కార్పొరేటర్ చేతన, డీసీ అరుణకుమారి,ఎంటమాలజిస్టు రజని,నరేశ్రెడ్డి,ఈఈ నాగేందర్, డీఈ నాగమణి,ఏఈ కీర్తి, టీఆర్ఎస్ నాయకులు కుమారస్వామి,చంద్రారెడ్డి, సోమిరెడ్డి,లక్ష్మీనారాయ ణ,లింగానాయక్,శ్రీధర్,వెంకటసాయి,నరేందర్, భాగ్యలక్ష్మీ,ధనలక్ష్మి,యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.