ఘట్కేసర్ రూరల్, మార్చి 2: యువత సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ రాచకొండ సీఐ సురేందర్ సూచించారు. మండల పరిధి వెంకటాపూర్లోని అనురాగ్ యూనివర్సిటీలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం గురువారం జరిగింది. బయటి వ్యక్తులతో మన వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోకూడదని, ఎవరైనా సైబర్ క్రైమ్ బారిన పడినప్పుడు త్వరగా 1930 నంబర్కు కాల్ చేసి సమాచారాన్ని ఇవ్వాలన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరిగా ఉండాలన్నారు.
ఈ సందర్భంగా సైబర్ నేరాల నియంత్రణపై పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ అడ్మిన్ డైరెక్టర్ మహిపతి శ్రీనివాస్ రావు, సైబర్ క్రైం ఎస్సై ప్రవీణ్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ మల్లేశ్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు నవీన్, కిరణ్ కుమార్, శంకర్రావు, వలంటీర్లు సింధు, అభిషేక్, భరత్, మహేందర్, అనీశ్, దీపక్, శాంతశ్రీ పాల్గొన్నారు.