అమృత్సర్ గురుద్వార్ తరహాలో పునరుద్ధరణ
శరవేగంగా పునరుద్ధరణ పనులు
సుందర పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నాం
పంద్రాగస్టులోపు అభివృద్ధి పనులు పూర్తి
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ)/బన్సీలాల్పేట్ : సుందర పర్యాటక కేంద్రంగా బన్సీలాల్పేట మెట్ల బావి ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బన్సీలాల్పేటలోని పురాతన మెట్ల బావి వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ఆదివారం మున్సిపల్ పరిపాలన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్, వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అనంతరం కాలనీ వాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. పంజాబ్ రాష్ట్రం అమృత్ సర్లోని గురుద్వార్ మెట్ల బావి మాదిరిగా బన్సీలాల్ పేట మెట్ల బావిని, ఈ పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పురాతన నిర్మాణాలకు పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి చెప్పారు.
అభివృద్ధి పనుల్లో భాగంగా బావి పరిసరాల్లోని అన్ని గృహాలకు నల్లా కనెక్షన్ ఇవ్వడంతో పాటు సీవరేజీ లైన్ల ఏర్పాటు, రహదారుల నిర్మాణం కూడా చేపడుతున్నట్లు వివరించారు. ఇకడ పర్యాటకుల కోసం మ్యూజికల్ లైటింగ్, బావి, పరిసరాలను వీక్షించే విధంగా గ్యాలరీ నిర్మాణం చేపడుతున్నట్లు పేరొన్నారు. పలు పండుగలు, ప్రత్యేక రోజుల్లో సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. బావి చరిత్రను తెలియజేసేలా ఫొటో గ్యాలరీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నగర వాసులే కాకుండా నగరానికి వచ్చిన ప్రతి ఒకరూ బన్సీలాల్ పేట బావిని చూడాలనిపించే విధంగా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా మెట్ల బావి పరిసరాల్లోని అన్ని భవనాలకు ఒకే రకమైన పెయింటింగ్ వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకడకు వచ్చే పర్యాటకుల వాహనాల పారింగ్ కోసం సమీపంలోని మున్సిపల్ గ్రౌండ్లో ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. వచ్చే ఆగస్టు 15వ తేదీ వరకు పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు కల్పన రమేశ్ పనుల పురోగతిపై మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ హేమలత, సికింద్రాబాద్ తాసీల్దార్ బి.శైలజ, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఈఈ సుదర్శన్, ఎలక్ట్రికల్ ఏఈ రవీందర్, వాటర్ వర్స్ ఏఈ శశాంక్ తదితరులు పాల్గొన్నారు.
మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించాలి
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒకరూ కృషి చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం బన్సీలాల్ పేటలోని మెట్లబావి వద్ద హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మంత్రి మట్టి గణపతి విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారీస్ విగ్రహాలతో నీరు, గాలి కలుషితమవుతున్నదని పేరొన్నారు. ప్రతి ఒకరూ వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.