బంజారాహిల్స్ : రాజీకి అవకాశం ఉన్న కేసులను పరిష్కరించుకునేందుకు శనివారం ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్లో భాగంగా వెస్ట్ జోన్ పరిధిలోని పలు పీఎస్ లలో కేసులు పరిష్కారానికి నోచుకున్నాయి. చిన్న చిన్న గొడవలు, రోడ్డుప్రమాదాల కేసులతో పాటు రాజీకి అవకాశం ఉన్న కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించారు.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అత్యధికంగా 132 కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించారు. నగరంలోనే అత్యధికంగా కేసులు పరిష్కరించిన పీఎస్ గా బంజారాహిల్స్ స్థానం సంపాదించింది. సంజీవరెడ్డినగర్ పీఎస్ లో 125 కేసులు లోక్ అదాలత్లో పరిష్క రించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో లోక్ అదాలత్లో భాగంగా 73కేసులు పరష్కారమయ్యాయి.
పంజాగుట్ట పీఎస్ లో 49 కేసులు, సైఫాబాద్ పీఎస్ లో 42 కేసులు, నారాయణగూడ పీఎస్ లో28కేసులు జాతీయ లోక్ అదాలత్లో పరిష్కారమయ్యాయి. దీంతో పాటు పెట్టీ కేసుల పరిష్కారంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ మొదటిస్థానంలో నిలిచింది. ఇక్కడ నమోద యిన 274 కేసులు పరిష్కారమయ్యాయి. జూబ్లీహిల్స్ పీఎస్ లొ 92పెట్టీ కేసులు, బంజారాహిల్స్లో మూడు కేసులు పరిష్కారమ య్యాయి.