బంజారాహిల్స్, డిసెంబర్ 19 : బంజారాహిల్స్లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. ఏప్రిల్ 2వ తేదీన అర్ధరాత్రి పుడింగ్ అండ్ మింక్ పబ్లో నిర్వహించిన ఓ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నారన్న సమాచారంలో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ దాడుల్లో పబ్లో సిద్ధంగా ఉంచిన 5 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు పబ్ మేనేజర్ మహాదారం అనిల్కుమార్, భాగస్వాములు పుప్పాల అభిషేక్, వీరమాచినేని అర్జున్, పెన్మత్స కిరణ్రాజులతో పాటు ఆరుగురు కస్టమర్లపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఈ కేసులో సోమవారం నాంపల్లిలోని సెషన్స్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో 200పైగా పేజీలతో చార్జిషీట్ దాఖలు చేశారు. 32మందిని సాక్షులుగా చేర్చడంతో పాటు డ్రగ్స్కు సంబంధించిన ఫోరెన్సిక్ నివేదికలు, ఇతర ఆధారాలను చార్జిషీటుతో జతపర్చారు.