ఖైరతాబాద్, ఏప్రిల్ 9 : జర్దా వాడకంపై సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయాలని పాన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ యాదవ్ కోరారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సికింద్రాబాద్ పాన్ షాప్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ సలావుద్దీన్, సికింద్రాబాద్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణతో కలిసి మాట్లాడుతూ ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులు, గుట్కా, ఖైనీలపై నిషేధాజ్ఞలు విధించడాన్ని తాము వ్యతిరేకించడం లేదన్నారు.
అందుకు ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామన్నారు. అయితే పాన్లో అతి ముఖ్యమైన జరదాను వాడుకునేందుకు మినహాయింపు కల్పించాలని, ఈ మేరకు కోర్టును ఆశ్రయించగా, జీవో నం.501/ఎఫ్ఎస్ఎస్1/2022 ద్వారా నాలుగు వారాల పాటు వాడుకోవచ్చని కోర్టు ఆదేశాలు జారీ చేసిందని, దానిని అమలు చేసి తమను ఆదుకోవాలని కోరారు.