Balkampet Yellamma | సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): ఘన చరిత్ర కలిగిన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. వచ్చే నెల 20వ తేదీన జరిగే బలంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం నిర్వహణ, ఏర్పాట్లపై ఎంసీఆర్హెచ్ఆర్డీలో బుధవారం సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 19న ఎదురోళ్లు, 20న అమ్మవారి కల్యాణం, 21న రథోత్సవం నిర్వహిస్తారన్నారు. అమ్మవారి కల్యాణాన్ని తిలకించేందుకు నగరం నుంచే కాకుండా రాష్ట్రం నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వస్తారని పేరొన్నారు. వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
ఈ సారి 15 లక్షల మంది భక్తులు..
గత సంవత్సరం అమ్మవారి కల్యాణానికి 8 లక్షల మంది వరకు భక్తులు వచ్చారని, ఈ సంవత్సరం 15 లక్షల వరకు వస్తారని అంచనా వేస్తున్నామని, అందుకు తగినట్లుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వివిధ రాష్ట్రాల్లోని వారు కూడా అమ్మవారి కల్యాణాన్ని వీక్షించే విధంగా ప్రత్యక్ష ప్రసారం (లైవ్) కు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. అమ్మవారి కల్యాణం నాటికి ఆలయ పరిసరాలలో అవసరమైన మరమ్మతులు, అభివృద్ధి పనులు పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమ్మవారి ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. అమ్మవారి కల్యాణం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అమ్మవారికి భక్తులు మొకుల రూపంలో సమర్పించిన వెండితో ఆలయ ప్రధాన ద్వారం తలుపులకు వెండి తాపడం చేసే పనులను కల్యాణం నాటికి పూర్తిచేస్తామని పేరొన్నారు.
నిర్వహణలో అన్ని శాఖల భాగస్వామ్యం
కల్యాణం నిర్వహణ, ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లక్షలాది మంది భక్తులు దర్శనం సమయంలో ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా పటిష్టమైన బారికేడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వివిధ శాఖల మధ్య సమన్వయంతో పని చేసే విధంగా ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా పారిశుధ్య నిర్వహణ కోసం అదనపు సిబ్బందిని నియమించి పర్యవేక్షించాలని ఆదేశించారు. క్యూ లైన్లో ఉండే భక్తుల కోసం వాటర్ ప్యాకెట్లు, బాటిల్స్ అందుబాటులో ఉంచాలని వాటర్ వర్స్ అధికారులను ఆదేశించారు. రథోత్సవం రోజున 500 మంది కళాకారులతో వివిధ సాంసృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు.
శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం ప్రస్తుతం ఉన్న సీసీ కెమెరాలకు అదనంగా తాతాలికంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు పక్కాగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డెవిస్, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, సాంసృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ, వాటర్ వర్స్ డైరెక్టర్ కృష్ణ, వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారి డాక్టర్ వెంకట్, ఐ అండ్ పీఆర్ జేడీ జగన్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మధుసూదన్ రావు, దేవాదాయ శాఖ రీజినల్ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, ఆర్డీఓ వసంత, కార్పొరేటర్ సరళ, మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఆలయ ట్రస్టీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఆలయ ఈఓ అన్నపూర్ణ, జోనల్ కమిషనర్ రవి కిరణ్, ఆర్ అండ్ బీ ఎస్ఈ లింగారెడ్డి, ఈఈ రవీంద్ర మోహన్, ట్రాన్స్ కో డీఈ సుధీర్, ఆర్టీసీ ఆర్ఎం వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.