కవాడిగూడ: కాచిగూడ మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్ సభ్యుడిగా సుంకరి బాలకిషన్రావు పటేల్ నియమితులయ్యారు. ఆయన మున్నూరు కాపు సంఘం అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్గా, విశ్రాంత విజిలెన్స్ చీప్ మహారత్న సీపీఎస్ యుగా పనిచేశారు.
ఈ సందర్భంగా బాలకిషన్రావు పటేల్ మాట్లాడుతూ ట్రస్ట్ విషయాలను పూర్తిగా అధ్యయనం చేసి అన్ని విషయాలపై స్పందిస్తానని, మున్నూరు కాపుల అభివృద్దికి తాను ట్రస్ట్ సభ్యులు, చైర్మన్ల సహకారంతో శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. ఆయన నియామకానికి కృషి చేసిన ఎంపీ కే. కేశవరావు, రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్, ఇతర ప్రజా ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలను తెలియజేశారు.