హైదరాబాద్ : ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చిన ఓ ప్రయివేటు బస్సులో 2.1 కిలోల బంగారం మాయమైంది. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. ముంబైలోని ఓ ప్రముఖ జ్యువెలరీ షాపులో పని చేస్తున్న గులాబ్ మాలిక్ (32).. 2.1 కిలోల బంగారాన్ని తీసుకుని సోమవారం రాత్రి హైదరాబాద్కు ప్రయివేటు బస్సులో బయల్దేరాడు. మంగళవారం ఉదయం ఆ బస్సు అమీర్పేటకు చేరుకుంది.
అక్కడ తన బ్యాగ్ను చెక్ చేయగా బంగారం ఆభరణాలు మాయమైనట్లు తేలింది. దీంతో తన యజమాని శ్రవణ్ గెహ్లాట్కు మాలిక్ సమాచారం అందించాడు. అనంతరం సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. ఆ కేసును పంజాగుట్ట పోలీసు స్టేషన్కు బదిలీ చేశారు. పోలీసులు ప్రత్యేక బృందాలను ముంబైకి పంపించి దర్యాప్తు చేస్తున్నారు.