బోడుప్పల్, జనవరి 7: మున్సిపల్ ఉద్యోగులకు వేతనాల పెంపుతో 29వేల 804మంది కార్మికులకు ఊరట లభించనుందని కోటా వెంకటేశ్వర్లు అన్నారు. ఔట్ సోర్సింగ్లో పనిచేస్తున్న 7,271 మంది కార్మికులకు 010 జీవో పరిధిలోకి తీసుకువచ్చి వేతనాలను చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. కరోన నియంత్రణలో ఫ్రంట్లైన్ వారియర్గా పనిచేసిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సేవలను ప్రభుత్వం గుర్తించి గౌరవించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
మున్సిపల్ కార్మికులకు ముప్పై శాతం వేతనాలు పెంచుతూ జీవో జారీ చేసి వారి బతుకుల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్ తమ పాలిట ‘ఆరాధ్య దైవం’ అని నగర వ్యాప్తంగా మున్సిపల్ కార్మిక ఉద్యోగులు శుక్రవారం సంబురాలు చేసుకున్నారు. పంటలు వేసుకోవడానికి ఆర్థికంగా చేయూతనిస్తూ రైతులకు అండగా తీసుకొచ్చిన ‘రైతుబంధు’ పథకం ఎంతో మేలును చేకూర్చుతుందని, ఆపత్కాలంలో ఆదుకుంటుందని, సీఎం కేసీఆర్ రైతులకు వెన్నుము కగా ఉంటూ ఆపద్బాంధవుడిగా సేవలందిస్తున్నారని రైతులు వేనోళ్ల కొనియాడారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు బంధు పథకంపై హైదరాబాద్ మహా నగర వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. రాష్ట్రంలో అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయం మొత్తం రూ.50వేలకోట్లకు చేరనున్న తరుణంలో ఊరూరా వారోత్సవాలు జోరుగా కొనసాగుతున్నా యి. రైతుబంధు స్ఫూర్తిని చాటేలా రైతు కుటుంబాలు శుక్రవారం అంతటా ముగ్గులు వేసి మురిసిపోయాయి. సంక్రాంతికి ముందే వాకిళ్లన్నీ హరివిల్లులు అయ్యా యి. పలువురు ప్రజాప్రతినిధులు రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేశారు.
అన్నదాతలకు పెద్దపీట ఘనత సీఎం కేసీఆర్దే..
శంషాబాద్, జనవరి 7: శంషాబాద్ హైస్కూల్లో విద్యార్థులకు శుక్రవారం రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఇందుకు మున్సిపల్ చైర్పర్సన్ సుష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతు లు అందజేశారు. ఆమె మాట్లాడుతూ అన్నదాతలకు పెద్దపీట వేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు.
చిరు ఉద్యోగుల పాలిట ఆరాధ్య దైవం
బడంగ్పేట, జనవరి 7: రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ చిరు ఉద్యోగులకు ఆరాధ్య దైవం లాంటి వారని బడంగ్పే ట మేయర్ చిగిరింత పారిజాతా నర్సింహారె డ్డి అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి 30 శాతం వేతనాలు పెంచుతూ జీవో జారీ చేయడంతో మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ముఖ్యమం త్రి కేసీఆర్ చిత్ర పటాలను కార్మికుల ఇండ్లలో పెట్టుకుంటామని శపథం చేశారు. చిరు ఉద్యోగలపై ముఖ్యమంత్రి చిత్తశుద్ధిని చాటుకున్నారని సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తు సంబురాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిబ్బందితో కలిసి పాలాభిషేకం చేశారు. మేయర్ మాట్లాడుతూ ఎవ్వరూ అడుగకుండానే ముఖ్యమంత్రి వేతనాలు పెంచారని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్స్ సూర్ణగంటి అర్జున్, పెద్ద బావి శ్రీనివాస్రెడ్డి, దర్శన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, మాజీ ఎంపీటీసీ సంరెడ్డి వెంకట్రెడ్డి, రాళ్ళగూడెం శ్రీనివాస్రెడ్డి, లిక్కి కృష్ణారెడ్డి, శ్రీశైలం చారి, బిల్ కలెక్టర్స్ నాగిరెడ్డి, శ్రీనివా స్, శ్రీహరి, బి శ్రీనివాస్, సాయి, మల్లేష్ ఉన్నారు.