గాజులరామారం, నవంబర్ 13: చిన్నపాటి నిర్లక్ష్యం ప్రాణాల మీదకు తెచ్చింది. చేతికొచ్చిన కొడుకు ప్రయోజకుడవుతాడనుకుంటే కండ్లముందే విగతజీవయ్యాడు. కన్నవారికి కడుపుకోత మిగిల్చాడు. జగద్గిరిగుట్ట సీఐ సైదులు వివరాల ప్రకా రం.. జగద్గిరిగుట్ట షిర్డీహిల్స్కు చెందిన శంకర్ టైలరింగ్ పనిచేస్తుండగా, భార్య తోపుడుబండిపై మిర్చి వ్యాపారం చేస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు కాగా, రెండోకుమారుడు వినేష్(20) బీటెక్ చదువుతున్నాడు. శనివారం ఉదయం దారం ఉండలు తెమ్మని తండ్రి ఫోన్ చేయడంతో వినేష్ తన పల్సర్బైక్పై జగద్గిరిగుట్ట వైపు వెళ్తూ ముందు బ్రేక్ సడన్గా వేయడంతో కిందపడి తలపగిలి ప్రాణాలు విడిచాడు. పోలీసులు మృతదేహాన్ని గాంధీకి తరలించారు. హెల్మెట్ పెట్టుకొనుంటే ప్రాణాలు దక్కేవని స్థానికులు చర్చించుకున్నారు. కాగా బండివెనక హెల్మెట్ ఉండటం గమనార్హం.