అబిడ్స్, డిసెంబర్ 11 : భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో 18 పడుల అయ్యప్ప సామూహిక మహాపడిపూజా కార్యక్రమాన్ని శబరిమల ఆలయ ప్రధాన మెల్శాంతి పూజారి శిష్ణు నంబూద్రి చేతుల మీదుగా వేదమంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర స్టాప్స్ అండ్ రిజిస్ట్రేషన్ జనరల్ జాయింట్ ఐజీ శ్రీనివాసులు, డీఐజీ సుమతి, ఎమ్మెల్యే రాజాసింగ్, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ప్రమోద, తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సభ్యురాలు బండి అపర్ణ, బాస్ అడ్వైజర్ దేవర రాజేశ్వర్, కట్ట మల్లేశం, కార్పొరేటర్లు జి. శంకర్యాదవ్, రాకేశ్ జైస్వాల్, మీరాలంమండి మహంకాళి ఆలయ చైర్మన్ గాజుల అంజయ్య, ప్రముఖ వ్యాపారవేత్త వీరేందర్ సింఘాల్ హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శబరిమలలో అయ్యప్ప దేవాలయంలో మాదిరిగా ఎగ్జిబిషన్ మైదానంలో ఇక్కడే శబరిమల ఉన్నట్లుగా భారీ ఏర్పాట్లు చేశారు.