పెద్దపల్లి, జనవరి 20(నమస్తే తెలంగాణ): అయోధ్య శ్రీ రాముల వారి ఆలయ ప్రారంభం, విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవం ఈ నెల 22న జరుగనుండగా, రైల్వే శాఖ మన రాష్ట్రం నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది.
ఈ నెల 29 నుంచి వచ్చే మార్చి 3వ తేదీ వరకు అయోధ్య ధాం రైల్వే జంక్షన్కి సికింద్రాబాద్, కాజీపేట, జాల్నా నుంచి ఆస్థా స్పెషల్ సర్వీసులు నడపాలని నిర్ణయించి, వాటి వివరాలు వెల్లడించింది.