కొండాపూర్ : మధుమేహ వ్యాధి పట్ల ప్రజలు సరైన అవగాహన కలిగి ఉండాలని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ( Justice NV Ramana) అన్నారు. ఆదివారం ఫిల్మ్నగర్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన డయాబెటిస్(Diabetes ) ఎక్స్ఫో- 2024కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యాధి దరిచేరకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు , వచ్చాక పాటించాల్సిన నియమాలపై ప్రత్యేక అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
మధుమేహ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తుందని, దేశంతో పాటు హైదరాబాద్ నగరంలో వ్యాధి తీవ్రత పెరుగుతుందన్నారు. యువత, చిన్న పిల్లలు సైతం మధుమేహ వ్యాధికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మారుతున్న జీవన విధానాలు, ఆహారపు అలవాట్లు ప్రధాన కారణంగా మారుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ఆహార నియమాలు, వ్యాయామాలు పాటించాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏషీయన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ చైర్మన్ డాక్టర్ కె సతీష్రెడ్డి, ప్రొఫెసర్ బీకే సహాయ్, డాక్టర్ వీ మోహన్, డాక్టర్ ఆర్ఎం అంజన తదితరులు పాల్గొన్నారు.