చర్లపల్లి, డిసెంబర్ 19 : ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఎమ్మెల్యే .. ఈసీఐఎల్ చౌరస్తాకు ఆటోలో ప్రయాణించిన అనంతరం కాప్రా ప్రెస్క్లబ్లో ఆటో డ్రైవర్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్లు జీవనోపాధి కోల్పోయారని, కుటుంబపోషణ కోసం ఇబ్బందులు ప డుతున్నారన్నారు.
ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ఆటో ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితి నెలకొందని, వెంటనే ప్రభుత్వం ఆటో డ్రైవర్లను గుర్తించి పదివేల జీవన వేతనం చెల్లించేందుకు చర్యలు తీ సుకొని వేతన భద్రత కల్పించాలని ఆయన కోరా రు. నియోజకవర్గ పరిధిలోని ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, ఆటో డ్రైవర్ల కు సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెం టనే పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కా ర్పొరేటర్ గొల్లూరి అంజయ్య, ఆటో యూనియన్ నాయకులు లక్ష్మీనారాయణ, నగేశ్, గోవింద్, శ్రీరాం, అంజనేయులు, గోవర్ధన్, శేషయ్య, అని ల్, రమేశ్, నాగరాజు, బీఆర్ఎస్ నాయకులు వం జరి ప్రవీణ్, రహీం, ఎంకిరాల నర్సింహా, గంప కృష్ణ, బచ్చన్నగారి శ్రీకాంత్రెడ్డి, పనగట్ట చక్రపాణి, బాబుగౌడ్, కనకయ్య, ప్రభాకర్ పాల్గొన్నారు.