హిమాయత్నగర్: ప్రభుత్వం మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారని తెలంగాణ ఆటో డ్రైవర్స్ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని, లేని పక్షంలో లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయకుండా ఆటో డ్రైవర్లు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. బుధవారం హైదర్గూడలోని ఎన్ ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రైవేట్ ఫైనాన్సియర్ల వద్ద రుణాలు తీసుకొని ఆటోలను కొనుగోలు చేసుకున్న ఆటో డ్రైవర్లు స్వయం ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్నారన్నారు. మూడు నెలలుగా గిరాకీ లేకపోవడంతో రాష్ట్రంలో ఉన్న 7లక్షల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయన్నారు. ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు కారణమైన ఉచిత బస్సు ప్రయాణాన్ని ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి రూ.12వేలు, ఈఎస్ఐతో పాటు ఆటో, మోటారు రంగ కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలన్నారు.