సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 ( నమస్తే తెలంగాణ ) : ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఆటోబంద్(Auto bandh )ను విజయవంతం చేయాలని టీఏటీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య పిలు పునిచ్చారు. ఉచిత బస్సు స్కీంతో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో, క్యాబ్ డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టబోయే ఆటో బంద్ను ప్రతి ఒక్క డ్రైవర్ విజయవంతం చేయాలని అన్నారు.
కాగా, జూపార్క్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్టీయూ ఆటో యూనియన్ స్టాండ్ను మంగళవారం వేముల మారయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ దయ్యాల దాసు, భవన నిర్మాణ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు చెన్నయ్య, నరసింహ, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నీరజంన్, పాషా, ఉపేందర్, మక్బూల్, ముజాత్ తదితరులు పాల్గొన్నారు.