పైప్లైన్ పనుల కోసం గుంతలు తవ్వారు..వదిలేశారు
రహదారిపైనే మట్టికుప్పలు
ఇబ్బందుల్లో వాహనదారులు
అత్తాపూర్, మార్చి 28: అత్తాపూర్ డివిజన్ పరిధిలోని హైదర్గూడ న్యూ ఫ్రెండ్స్కాలనీ ప్లజెంట్ పార్కు నుంచి ఎర్రబోడ చౌరస్తా వరకు సీవరేజీ పనులను నెల రోజుల క్రితం ప్రారంభించారు. పైప్లైన్ పనులు సగం ముగిసి మిగతా పనులు చేస్తుండగా విద్యుత్ కేబుల్లు అడ్డంగా ఉండటంతో పైప్లైన్ పనులు చేయడానికి ఆ టంకం ఏర్పడింది. ఇదే విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారులకు చెప్పిన కాంట్రాక్టర్ విద్యుత్ తీగల సమస్యను పరిష్కరిస్తే గాని పైప్లైన్ పనులు చేయడం కుదరదని పనులు నిలిపి వేశాడని తెలుపుతున్నారు. దీంతో రహదారిపై తీసిన గుంతలు, వేసిన మట్టి, పైప్లు, గ్రానెట్ రాళ్లు రోడ్డుపైనే ఉండటంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదర్గూడ, అత్తాపూర్, కృష్ణానగర్, శివనగర్ ప్రాంతాల ప్రజలు లంగర్హౌస్, ఎర్రబోడ, సరిమల్లెకాలనీ, నలందనగర్కు వెళ్లాలంటే ఇదే ప్రధాన రహదారి కావడంతో గంటల తరబడి ట్రా ఫిక్ అంతరాయం కల్గుతుందని వాపోతున్నారు. రోడ్డుపై ఉన మట్టికుప్పల కారణంగా పక్కనే ఇండ్లల్లో ఉన్న వాళ్లు బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. పనులు ఆగిపోయి విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ, విద్యుత్శాఖ అధికారులు సవన్వయంతో పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.
త్వరలో పనులు ప్రారంభిస్తాం
విద్యుత్ శాఖ అధికారులకు కేబుల్ సమస్యపై ఫిర్యాదు చేశాం. అందుకు సంబంధించి పనుల కోసం డీడీ కట్టాలన్నారు. సం బంధిత శాఖ అధికారులు చెప్పిన ప్రతిపాదనలను ఉన్నతా ధికారులకు తెలిపాం. త్వరలో సమస్యను పరిష్కరించుకొని పైప్లైన్ పనులు ప్రారంభిస్తాం. – ప్రశాంత్, జీహెచ్ఎంసీ ఏఈ