హైదరాబాద్ : నగర పరిధిలోని హుమయూన్నగంలో ఓ వ్యక్తి వీరంగం సృష్టించారు. ఆర్డర్ ఆలస్యమైందంటూ ఫుడ్ డెలివరీ బాయ్పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. 15 మంది అనుచరులతో వచ్చి హోటల్ వద్ద వీరంగం సృష్టించాడు. భయంతో డెలివరీ బాయ్ హోటల్లోకి పరుగుపెట్టగా.. అయినా వదలకుండా యువకులు హోటల్లోకి దూసుకెళ్లి డెలివరీ బాయ్పై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో మరిగే నూనెపడడంతో డెలివరీ బాయ్కి తీవ్ర గాయాలయ్యాయి. డెలివరీ బాయ్తో పాటు మరో ముగ్గురికి సైతం గాయాలయ్యాయి. అయితే, పోలీసుల సమక్షంలోనే గొడవ జరిగిందని హోటల్ సిబ్బంది ఆరోపించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.