హైదరాబాద్ : అర్ధరాత్రి ఓ ఆటో డ్రైవర్పై గుర్తు తెలియని దుండగులు దారుణానికి పాల్పడ్డారు. ఆటోల నిద్రస్తుండగా బండరాళ్లతో రాళ్లతో దాడి చేసి తల పగులగొట్టారు. ఈ సంఘటన కర్మాన్ఘాట్ చౌరస్తాలో చోటు చేసుకుంది.
రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని స్థానికులు గమనించి అంబులెన్స్కు ఫోన్ చేసి హుటాహుటిన ఉస్మానియా దవాఖానకు తరలించారు. కాగా, ఆటో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఈ మేరకు సరూర్నగర్ పోలీసులకు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.