హైదరాబాద్ : నగరంలో నకిలీ కరెన్సీ పెద్ద ఎత్తున పట్టుబడతుండటం కలకలం రేపుతున్నది. నిన్నటికి నిన్న ఫేక్ కరెన్సీతో ప్రజలను మోసగిస్తున్న ఇద్దరు విదేశీయులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.25 లక్షల నకిలీ కరెన్సీ, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ సంఘటన మరువకముందే.. చింతలకుంట(Chintalakunta) వద్ద రద్దయిన మిలియన్ టర్కీష్ లిరా కరెన్సీ(Turkish Lira currency)ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన టర్కీష్ కరెన్సీ విలువ సుమారు రూ.27 కోట్లు(Rs. 27 Crore) ఉంటుందని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.