బంజారాహిల్స్,ఆగస్టు 15 : భార్యతో పాటు కూతురిపై దాడికి పాల్పడడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని సింగాడకుంటలో నివాసం ఉంటున్న మహ్మద్ యూసుఫ్, అమీషా యూసుఫ్లకు గత కొంతకాలంగా విభేదాలున్నాయి. ఇంటికి సంబందించిన అద్దెలు మొత్తం యూసుఫ్ వసూలు చేసుకోవడంతో పాటు జల్సాలకు ఖర్చు చేస్తుంటారని, ఇంట్లో పెళ్లీడుకు వచ్చిన ఆడపిల్లలను పట్టించుకోవడం లేదని తరచూ భార్య అమీషా గొడవ పడుతుంటుంది.
ఈ నేపథ్యంలో శనివారం ఇంటికి వచ్చిన తండ్రి యూసుఫ్ తన తల్లితో పాటు సోదరిపై విచక్షణారహితంగా దాడి చేశారని, వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ పెద్ద కూతురు రితూ యూసుఫ్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తమను వేధింపులకు గురిచేయడంతో పాటు ఇంటి అద్దెల గురించి అడిగితే తల్లీ కూతుళ్లను రేప్ చేయిస్తానంటూ బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడు యూసుఫ్పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో పాటు అదుపులోకి తీసుకున్నారు.