మల్కాజిగిరి జోన్ బృందం, జూలై 16 : ఆషాఢ మాసం అమ్మవారి బోనాల సంబురాలు అంబరాన్నంటాయి. మల్కాజిగిరి నియోజకవర్గం పరిధిలోని అమ్మవారి ఆలయాలు ఆదివారం భక్తులతో కిక్కిరిసిపో యా యి. మహిళలు, యువతులు బోనాలను తీసుకువెళ్లి అమ్మవార్లకు సమర్పించారు. తొట్టెలు, ఘటం ఊరేగింపులు, పోతరాజుల విన్యాసాలతో ఆయా ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. నియోజకవర్గంలోని పలు ఆలయాల్లో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కార్పొరేటర్లు ప్రేమ్కుమార్, శాంతిశ్రీనివాస్ రెడ్డి, సబితాకిశోర్, జితేంద్రనాథ్, మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, తదితరులు పూజలు నిర్వహించారు. ఈ పూ జా కార్యక్రమాల్లో అధికార ప్రతినిధి జీఎన్వీ సతీష్కుమార్, మీడియా కన్వీనగర్ గుండా నిరంజన్, రాముయాదవ్, అనిల్కిశోర్, పరశురాంరెడ్డి, శ్రీనివాస్, సంతోష్రాందాస్, మోహన్రెడ్డి, కవిత, బొబ్బిలి సురేందర్రెడ్డి, శ్రీశైలం, వెంకటేశ్, వెంకట్గౌడ్, మల్లికార్జునగౌడ్, పుదారి రాజేష్కన్న , తదితరులు పాల్గొన్నారు.
ఓల్డ్ మల్కాజిగిరిలోని బందర్ పోచమ్మ దేవాలయంలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు తరలివెళ్లి పోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించారు. ఎమ్మెల్యే మైనంపల్లి హ న్మంతరావు, తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు యాతం రఘుయాదవ్ స్నేహ కుటుంబ సభ్యులు ఊరేగింపుగా బందర్ పోచమ్మ దేవాలయానికి వెళ్లి బోనం సమర్పించారు.కార్పొరేటర్లు ప్రేమ్కుమార్, మేకల సునీతారాముయాదవ్, మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, స్వప్న, కనకమహాలక్ష్మి, సంతోష్రాందాస్, మోహన్రెడ్డి, సన్నీయాదవ్, రాకేశ్, ప్రవీణ్ పాల్గొన్నారు.
డివిజన్, నేరేడ్మెట్ డివిజన్లలోని పలు అమ్మవార్ల దేవాలయాలను స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు దర్శించుకుని పూజలు నిర్వహించారు. పూజల్లో కార్పొరేటర్ ప్రేమ్ కుమా ర్, మాజీ కార్పొరేటర్ జగదీశ్గౌడ్, బద్దం పరశురాం రెడ్డి, పిట్ల శ్రీనివాస్, జీఎన్వీ సతీశ్కుమార్, ధర్మేష్ యాదవ్, పేపర్ శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, ఆగమయ్య, సంతోష్ రాందాస్, బాలకృష్ణ తదితరులు ఉన్నారు. అలా గే.. సైనిక్పు రి అంబేద్కర్నగర్లోని నల్ల పోచమ్మ దేవాలయంలో అమ్మ వారికి నేరేడ్మెట్ డివిజన్ కార్పొరేటర్ కొత్తపల్లి మీనా ఉపేందర్ రెడ్డి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.