సైదాబాద్, నవంబర్ 17 : మాయమాటలు చెప్పి మోసాలు చేసే వ్యక్తులు మీ దగ్గరికి వస్తున్నారని వారి మాటలను నమ్మ వద్దని హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మలక్పేట ఎంఐఎం ఎమ్మెల్యే అభ్యర్థి అహ్మద్ ్ల బలాలకు మద్దతుగా ఆయన పలు ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించిన అనంతరం అక్బర్బాగ్ పల్టన్ చౌరస్తాలో ఏర్పాటు జల్సాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రసంగించారు. ఎంఐఎం అభ్యర్థి బలాల మాట్లాడుతూ.. ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి పనులను చేపట్టి పూర్తిచేశామని తెలిపారు. శుక్రవారం సాయంత్రం నల్లగొండ చౌరస్తాలోని మీనా ఫంక్షన్ హాల్ ఎంఐఎం ఎన్నికల కార్యాలయాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో వివిధ డివిజన్లకు చెందిన ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
ప్రజల సంక్షేమమే ధ్యేయం
చాదర్ఘాట్, నవంబర్ 17:ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా తమ పార్టీ పని చేస్తుందని మలక్పేట ఎంఐఎం అభ్యర్థి, ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు. శుక్రవారం ఆజంపుర డివిజన్లోని డీసీ పటేల్ కాలనీ, రాజనర్సింహ నగర్, మజ్దిద్-ఏ-సూఫీఅలీ, బీధిఅలీషా ఖిడ్కీ, తిలక్ మాతా ఆలయం, మరియం స్కూల్, ముబీన్ కార్ఖాన రోడ్డులో ఉదయం ఇంటింటికి పాదయాత్ర నిర్వహించారు. సాయంత్రం ఛావునీ డివిజన్ పరిదిలోన బీబీ క్యాన్సర్ దవాఖాన, థ్రీ బంగ్లా, ఆఫీసర్ కాలనీ, పత్తర్ కి మస్జీద్, జైకా హోటల్, కమాన్ కి గల్లీ, సన్వీడియో పాయింట్, గ్రీన్ ల్యాండ్ హోటల్, మస్జిద్-ఏ-సలాహీన్, చంచల్గూడ ప్రాంతాల మీదుగా పాదయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో ఎంఐఎం నేతలు షేక్ మొహియుద్దీన్ అబ్రార్, అలీం పాల్గొన్నారు.
పార్టీ కార్యాలయం ప్రారంభం..
అక్బర్బాగ్ డివిజన్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే బలాల నియోజకవర్గం పార్టీ ప్రధాన ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాల్సిన తీరు, తదితర అంశాలపై స్థానిక ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు.
అత్యధిక నిధులు తెచ్చి అభివృద్ధి పరిచా
మలక్పేట, నవంబర్ 17 : మలక్పేట నియోజకవర్గానికి అత్యధిక నిధులు తెచ్చి అభివృద్ధి పరిచానని మలక్పేట ఎంఐఎం అభ్యర్థి, ఎమ్మెల్యే అహ్మద్ బలాల అన్నారు. శుక్రవారం నూర్ మసీదు వీధిలో డివిజన్ ఎంఐఎం అధ్యక్షుడు షఫీ, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పాత మలక్పేట డివిజన్లో రూ.వందల కోట్లతో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వసతులు కల్పించటం జరిగిందన్నారు. మలక్పేటలో యువతకు ఉపాధి కల్పించేందుకు ఐటీ టవర్కు ఇటీవలే నిర్మాణానికి శంకుస్థాపన చేశామని తెలిపారు. కార్యక్రమంలో డివిజన్ ఎంఐఎం అధ్యక్షుడు షఫీ, కాలనీవాసులు, ఎంఐఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.