Congress Party | హైదరాబాద్ : ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి రేపు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. పార్టీలో సీనియర్లకు న్యాయం జరగలేదంటూ సోమశేఖర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రేటర్ పరిధిలో రేవంత్ రెడ్డికి సోమశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే టికెట్ ఆశించారు సోమశేఖర్ రెడ్డి. ఉప్పల్ టికెట్ లభించని నేపథ్యంలో సోమశేఖర్ రెడ్డి ఆదివారం రాజీనామా చేయనున్నారు.
ఇప్పటికే మల్కాజ్గిరి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నందికంటి శ్రీధర్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే టికెట్ ఆశించగా, పొన్నాల జనగామ టికెట్ ఆశించారు. వీరిద్దరికి ఎమ్మెల్యే టికెట్లు దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు.