సిటీబ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా చేపట్టిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఇద్దరిని గ్రేటర్కు కేటాయించింది. రెండు నెలల కిందటే జోనల్ కమిషనర్ హోదాలో బదిలీపై వచ్చిన స్నేహ శబరీష్ను కొమురం భీం జిల్లా కలెక్టర్గా బదిలీ చేయగా.. ఆమె స్థానంలో హేమంత్ సుందర్రావుకు ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది. అదేవిధంగా హైదరాబాద్ రెవెన్యూ అడిషనల్ కలెక్టర్గా హేమంత్ కేశవ్ పాటిల్ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.