సిటీబ్యూరో: హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్, ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో భాగంగా బంజారాహిల్స్, జూబ్లిహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరుగుతున్న స్టీల్ ఫ్లైఓవర్, అండర్పాస్ నిర్మాణ పనుల దృష్ట్యా కేబీఆర్ పార్కు వద్ద ఆదివారం వన్వే ట్రాఫిక్ ట్రయల్ రన్ నిర్వహించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు జరిగిన ఈ ట్రయల్న్న్రు నగరపోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్తో కలిసి కేబీఆర్ మెయిన్గేట్ నుంచి బసవతారకం ఆసుపత్రి, అగ్రసేన్ జంక్షన్, ఫిలింనగర్, రోడ్ నంబర్ 45 మీదుగా జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వరకు ఉన్న ప్రధానకూడళ్లను సందర్శించిన సీపీ అక్కడ వాహనాల రాకపోకలను పర్యవేక్షించారు.
భవిష్యత్లో నగరంలో పెరగనున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీపీ తెలిపారు. ఈ వన్వే ట్రాఫిక్ ట్రయల్న్ ఆదివారం ఒక్కరోజు మాత్రమే నిర్వహించామని, సోమవారం నుంచి ట్రాఫిక్ యధావిధిగా అనుమతిస్తామన్నారు. ట్రయల్ రన్ ద్వారా క్షేత్రస్థాయిలో గమనించిన అంశాలను, అవసరమైన మెరుగుదలను విశ్లేషించి త్వరలోనే జీహెచ్ఎంసీకి ఒక నివేదిక అందజేస్తామని సజ్జనార్ చెప్పారు. నివేదిక ఆధారంగా అవసరమైన మార్పులు చేసిన తర్వాత ప్రజలకు ముందస్తు సమాచారం అందించి మరోసారి వన్వే సిస్టం ట్రయల్న్న్రు నిర్వహిస్తామని సీపీ సజ్జనార్ చెప్పారు.