సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): నగరంలోని దుర్గంచెరువు ఐటీ హబ్ కావడంతో నిత్యం భారీగా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఉదయం సాయంత్రం వేళల్లో ఐటీ ఉద్యోగులు పోతుంటారు.. వస్తుంటారు. కాగా గురువారం ఐకియా ఏఐజీ రోడ్డు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో కార్లు ,ద్విచక్రవాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.