వనస్థలిపురం : అసిఫాబాద్ ప్రాంతం నుంచి గంజాయిని తీసుకువచ్చి రిటైల్గా విక్రయించే ముగ్గురు యువకులను వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం. అసిఫాబాద్ జిల్లా కృష్ణనాయక్ తాండకు చెందిన రాథోడ్ క్రిష్ణ (22), హయత్నగర్ కుంట్లూరుకు చెందిన ఇ.నరేష్ (23), కర్రె మనోజ్రెడ్డి (20)లు స్నేహితులు.
వీరు గత కొంతకాలంగా గంజాయిని నగరానికి తీసుకువచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి రూ.100కు ఒక ప్యాకెట్ విక్రయిస్తున్నారు. బుధవారం వాహన తనిఖీ చేస్తున్న పోలీసులకు ఆటో(టీఎస్11యుబి6344)లో అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో పోలీసులు విచారించగా తమ వద్ద గంజాయి ఉన్న సంగతి తెలిపారు.
వారి వద్ద 6వందల గ్రాముల గంజాయి లభించింది. వారిని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.