హైదరాబాద్ : పెట్టుబడి(Investment) పేరుతో మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని సైబర్ క్రైం(Cyber crime) పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. శిరీష్ అనే నిందితుడు చైనావారితో కలిసి వాట్సప్, టెలిగ్రామ్, ఆన్లైన్లో ఉత్పత్తులకు రేటింగ్ ఇస్తామంటూ మోసాలకు పాల్పడ్డాడు. నిందితుడి బ్యాంకు ఖాతా నుంచి రూ.1.5 కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రజలు సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.