వనస్థలిపురం, సెప్టెంబర్ 13 : నకిలీ తుపాకీని తలకు గురిపెట్టిన దుండగులు.. దారిదోపిడీకి యత్నించారు. ఈ ఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ జలంధర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జనార్దన్రెడ్డినగర్కు చెందిన ఆవోజు బాలబ్రహ్మచారి(33), వనస్థలిపురం గాయత్రినగర్కు చెందిన వినయ్ మౌర్య(21) జల్సాల కోసం దారి దోపిడీలు చేసేందుకు పథకం వేశారు. ఇందుకు ఓ బొమ్మ తుపాకీని కొనుగోలు చేశారు. మంగళవారం రాత్రి ఇంజాపూర్ అటవీ ప్రాంతాన్ని దోపిడీ కోసం ఎంచుకున్నారు. తుర్కయంజాల్కు చెందిన వీరేసింగ్, అతడి స్నేహితుడు వెంకట్ నాయక్ దిల్సుఖ్నగర్లో షాపింగ్ పూర్తి చేసుకుని బైక్పై ఇంటికి వెళ్తున్నారు.
ఇంజాపూర్ వద్ద మూత్ర విసర్జనకు బండి ఆపి.. కిందికి దిగారు. గమనించిన నిందితులు ఇన్నోవా కారులో వేగంగా వచ్చి అక్కడికి చేరుకొని ఆగారు. కారులో నుంచి కిందికి దిగి వీరేసింగ్ తలపై నకిలీ తుపాకీని పెట్టి.. డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. అది గమనించిన వెంకట్ నాయక్ అప్రమత్తమై.. తుపాకీ పట్టుకున్న వ్యక్తిని గట్టిగా పట్టుకుని బిగ్గరగా అరిచాడు. ఆ సమయంలో అటునుంచి వెళ్తున్న వాహనదారులు గమనించి.. నిందితులను పట్టుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.