హిమాయత్నగర్,ఆగస్టు26 : యువతిని వేధింపులకు గురి చేస్తున్న ఓ యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంఘటన నారాయణగూడ పీఎస్ పరిదిలో చోటు చేసుకుంది. ఎస్సై సంధ్య తెలిపిన వివరాల ప్రకారం.. కింగ్కోఠిలో నివాసం ఉంటున్న ఓ యువతికి అదే ప్రాంతానికి చెందిన సల్మాన్ఖాన్కు పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది.
గత ఏడాది ఇద్దరి మధ్య వాగ్వివాదం జరుగడంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా జైలుకు వెళ్లి వచ్చాడు. జైలుకు వెళ్లి వచ్చిన తరువాత తన ప్రవర్తనను మార్చుకోకుండా కొద్ది రోజుల నుంచి యువతిని వెంబడించడం, వేధింపులకు గురిచేస్తున్నాడు. దీంతో యువతి తన తల్లితో పీఎస్కు వచ్చి మరోమారు ఫిర్యాదు చేసింది.పోలీసులు సల్మాన్ఖాన్ను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.