మన్సూరాబాద్, సెప్టెంబర్ 9 : మన్సూరాబాద్ పెద్దచెరువు, నాగోల్ చెరువులో వినాయక నిమజ్జనాల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని జీహెచ్ఎంసీ హయత్నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ తెలిపారు. వినాయక నిమజ్జనాల కోసం మన్సూరాబాద్ పెద్దచెరువు, నాగోల్ చెరువు ప్రాంగణంలో చేపట్టిన సుందరీకరణ పనులను గురువారం ఆయన సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనాల కోసం నిర్మించిన కొలనులను శుభ్రం చేసి మంచినీటిని నింపినట్లు తెలిపారు. నిమజ్జనాల కోసం వచ్చే భక్తుల కోసం మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామనిపేర్కొన్నారు. నిమజ్జనాల కోసం ఒక్కో చెరువు వద్ద రెండు క్రేన్లను సిద్ధం చేశామని వివరించారు.
వినాయక నిమజ్జనాల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో డీఈ కనకయ్య, ఏఈ ఈశ్వర్, వర్క్ ఇన్స్పెక్టర్ సీతరాం తదితరులు పాల్గొన్నారు.