సిటీ బ్యూరో, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల వివరాలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ యాప్ లో అప్లోడ్ చేసేందుకు సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తహసీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీఓలు,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయర్లతో నిర్వహించిన రెవెన్యూ అధికారుల కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొని ల్యాండ్ బ్యాంక్, ప్రభు త్వ భూముల కేటాయింపులు తదితర 20 అంశాలపై మండలాల వారీగా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ల్యాండ్ రికార్డ్ నిర్వహణలో రెవె న్యూ అధికారుల పాత్ర ముఖ్యమైనదని, అధికారులు లక్ష్యం నిర్దేశించుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ల్యాండ్ బ్యాంక్ మేనేజ్మెంట్ సిస్టంను అప్డేట్ చేసి వివరాలను డిజిటలైజేషన్ చేయాలని చెప్పారు. ప్రభుత్వం వివిధ శాఖలకు ఇచ్చిన భూముల్లో వినియోగంలో ఉన్నవి, వినియోగంలో లేనివి, ఖాళీగా ఉన్న వి ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో గుర్తించి ఆక్రమణల గురికాకుండా ఉండేందుకు డిజిటలైజేషన్,అప్డేషన్ చేయాలన్నారు.
22న పైలెట్ ప్రాజెక్టుగా తిరుమలగిరి మండలంలో చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జీ ముకుందరెడ్డి, డీఆర్ఓ ఈ వెంకటాచారి, ఆర్డీవో సాయిరాం, సర్వే అండ్ ల్యాండ్ రికారడ్స్ ఏడీ శ్రీరాం, ఈడీఎం రజిత, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు,తహసీల్దార్లు, డి ప్యూటీ తహసీల్దార్లు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.