రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో అటు తాగునీటి సరఫరాతో పాటు మురుగు నీటి శుద్ధిని సమర్థవంతంగా నిర్వహిస్తూ జలమండలి అందరి మన్ననలు అందుకుంటున్నది. ప్రజలకు మెరుగైన సేవలను అందించడానికి తన పరిధిని మరింత విస్తరించుకుంటుంది. జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగు రోడ్డు లోపలి గ్రామాలకు తాగునీరు అందిస్తూ, నగర శివారు ప్రాంతాల్లో సీవరేజీ నిర్వహణ బాధ్యతలు చేపట్టి తన సేవలను విసృ్తత పరిచింది. నగరంలో వరుసగా ఐదేండ్లు కరువొచ్చినా.. తాగునీటి సరఫరాకు ఎలాంటి ఢోకా లేకుండా చేస్తున్నది.
ఇప్పటికే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటి సరఫరా చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. గ్రేటర్ హైదరాబాద్లో వరుసగా ఐదేండ్లు కరువొచ్చినా తాగునీటి సరఫరాకు ఎలాంటి ఢోకా లేకుండా చేస్తున్నది. సీఎం కేసీఆర్ దిశానిర్దేశం, మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో జలమండలి నగరంలో తాగునీటి సరఫరాకు పకడ్బందీ ప్రణాళికలు అనుసరిస్తోంది. మహానగరానికి తాగునీటి ఎద్దడి రాకుండా కృష్ణా, గోదావరి జలాలను సరఫరా చేస్తున్న జలమండలి, గోదావరి నీటి కోసం కేశవాపూర్ రిజర్వాయర్, కృష్ణా నీటి కోసం సుంకిశాల ప్రాజెక్టులు చేపడుతోంది. అలాగే ఔటర్ పరిధిలో శివారు ప్రాంతాల ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు ఓఆర్ఆర్ ఫేజ్-1 పూర్తి చేసిన వాటర్బోర్డు.. ఇప్పుడు ఫేజ్-2 పనులకు శ్రీకారం చుట్టింది. ఇలా ఓ వైపు తాగునీటి సరఫరా బాధ్యతలు మోస్తూనే, మరో వైపు మురుగునీటి శుద్ధిని సమర్థంగా నిర్వహిస్తూ అందరి మన్ననలు అందుకుంటోంది. మురుగు నీటిని ఇప్పటికే శుద్ధి చేస్తోన్న జలమండలి కొత్తగా 31 ఎస్టీపీలను నిర్మిస్తోంది. జలమండలి కృషికి గుర్తింపుగా ఈ ఏడాది పలు అవార్డులు కూడా సొంతం చేసుకోవడం విశేషం.
సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకుంటున్న జలమండలి వినియోగదారులకు పారదర్శకంగా సేవలు అందిస్తున్నది. పెరుగుతున్న జానాభాకు అనుగుణంగా నీటి సరఫరా, మురుగు నీటి శుద్ధి వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రచించింది. నాడు వేసవిలో సరిపడా తాగునీరు లేక జనం అల్లాడిపోయే దశ నుంచి నేడు నగరంతో పాటు శివారు గ్రామాలకు సైతం నీరందించే స్థితికి చేరుకున్నది. నగరంలో వరుసగా ఐదేండ్లు కరువొచ్చినా.. తాగునీటి సరఫరాకు ఎలాంటి ఢోకా లేకుండా సుంకిశాల వంటి ప్రాజెక్టు రూపొందించి శరవేగంగా పూర్తి చేయడానికి అడుగులు వేస్తున్నది. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో నూతనంగా 31 మురుగు శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ), ఎఫ్ఎస్టీపీలను ఆయా ప్రాంతాల్లో నిర్మిస్తున్నది. తకువ ధరకే వినియోగదారులకు సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ సేవల్ని అందిస్తున్నది. ఇది గత ఎనిమిదిన్నర ఏండ్లలో జలమండలి సాధించిన ప్రగతి. ప్రస్తుతం సాధించిన విజయాలతో పాటు భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకొని వాటిని సాధించే దిశగా పయనిస్తున్నది.
ఇప్పటికే సుమారు రూ.700 కోట్లతో ఓఆర్ఆర్ ఫేజ్-1 పూర్తి చేసిన జలమండలి.. ఇప్పుడు ఫేజ్-2 పనులకు శ్రీకారం చుట్టింది. ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, గృహ లేఅవుట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు తాగునీటిని అందించేందుకు రూ.1200 కోట్లతో ఓఆర్ఆర్-2 ప్రాజెక్టు చేపట్టారు. కొత్తగా 137 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో రిజర్వాయర్లు ఏర్పాటు చేయడం, ఇన్లెట్లు, అవుట్ లెట్లు, 2,863 కిలో మీటర్ల నూతన పైపులైన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, వీటిని వేయడానికి తవ్విన రోడ్లను పునరుద్ధరించడం, బీపీఎల్ కుటుంబాలకు నల్లా కనెక్షన్లు ఇవ్వడం, క్లోరినేషన్ రూమ్లను నిర్మించడం వంటి పనులతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. ప్రస్తుత అవసరాలతో పాటు భవిష్యత్తు అవసరాలకు సైతం సరిపోయేలా ప్రణాళికలు రచించారు. 2036 నాటికి ఈ ప్రాంతాల్లో జనాభా సంఖ్య 33.92 లక్షలకు పెరగనున్నదని అంచనా వేసి, పెరిగే జనాభాకు సరిపడా నీటిని అందించే విధంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఈ మొత్తం ప్రాజెక్టు పూరె్తైతే ఓఆర్ఆర్ పరిధిలో కొత్తగా 2 లక్షల కుటుంబాలకు మంచినీటి నల్లా కనెక్షన్లు రాగా.. సుమారు 20 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందుతుంది. ఇప్పటికే ఉన్న 1.5 లక్షల నల్లా కనెక్షన్లకు సరిపడా నీటి సరఫరా జరుగుతుంది. ఈ పనులకు 2022 జనవరి 24న మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టును రెండు ప్యాకేజీల్లో చేపడుతున్నారు.
హైదరాబాద్ మహా నగరానికి తాగునీటి ఎద్దడి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా సుంకిశాల ప్రాజెక్టును చేపడుతున్నది. ఇప్పటికే కృష్ణా, గోదావరి జలాలను అందజేస్తున్న జలమండలి నగర ప్రజల దాహం తీరుస్తున్నది. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ముందస్తు ప్రణాళికలు రచించి.. అందుకు తగ్గట్లుగానే ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. గోదావరి నీటి కోసం కొండపోచమ్మ సాగర్ వద్ద కేశవాపూర్ రిజర్వాయర్, కృష్ణా నీటి కోసం సుంకిశాల ప్రాజెక్టులు చేపడుతున్నది.
రూ.1450 కోట్లతో సుంకిశాల ప్రాజెక్టు పనులు చేపడుతున్నారు. నాగార్జునసాగర్ నుంచి కృష్ణా నీటిని తరలించేందుకు ఈ ప్రాజెక్టును నిర్మించగా.. నగరానికి వరుసగా ఐదేండ్లు కరవు వచ్చినా, వర్షాభావ పరిస్థితులు ఏర్పడినా, నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజీ ఉన్నా.. దీని ద్వారా ప్రజలకు తాగునీరు అందించే వీలుంటుంది. వాస్తవానికి వేసవిలో నగరానికి నీరు తరలించేందుకు ఎమర్జెన్సీ పంపింగ్ చేయాల్సి వచ్చేది. దీని కోసం ఏటా రూ.6 కోట్లు ఖర్చయ్యేవి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆ బాధలు తప్పడమే కాకుండా.. అవసరమైతే పారిశ్రామిక అవసరాలకు సైతం నీటిని వినియోగించుకోవచ్చు. మొత్తం ప్రాజెక్టును 2023 జూన్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇకడి నుంచి 20 టీఎంసీల నీరు తరలించనున్నారు.
3 ప్యాకేజీల్లో నిర్మిస్తున్న 31 ఎస్టీపీలు అందుబాటులోకి వస్తే నగరంలో మురుగు సమస్యకు పరిషారం లభిస్తుంది. వీటి ద్వారా రోజుకు 1282 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేయవచ్చు. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో కొత్త ఎస్టీపీల నిర్మాణం జరుగుతున్నది. వీటి నిర్మాణ పనులను ఎండీ దానకిశోర్ పలుమార్లు సందర్శించి పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ లోటుపాట్లను గమనించి దిశానిర్దేశం చేస్తున్నారు. వచ్చే దసరా నాటికల్లా కొన్నింటిని, ఏడాది చివరి నాటికల్లా పూర్తి స్థాయిలో ఈ పథకం పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. కాగా నగరంలోని గోషామహల్, నాంపల్లి, కార్వాన్తో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీవరేజీ వ్యవస్థను ఆధునీకరిస్తున్నారు. 33.50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి సంబంధించి మొత్తం 129.32 కిలోమీటర్ల పొడవైన పైపులైన్ నిర్మిస్తున్నారు.
నగరంలో రోజూ ఉత్పత్తయ్యే మురుగు నీటిని జలమండలి ఇప్పటికే శుద్ధి చేస్తున్నది. దీన్ని మరింత విస్తరించేందుకు మరో అడుగు ముందుకేసింది. నగరంలోని పలు చోట్ల రూ.3,866.41 కోట్ల వ్యయంతో కొత్తగా 31 మురుగు నీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీ) నిర్మిస్తున్నది. వీటిని 3 ప్యాకేజీల్లో 5 సరిళ్లలో నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణం ద్వారా పరివాహక ప్రాంతాల్లో మురుగు ప్రవాహాన్ని నిరోధించడం, 100 శాతం మురుగును శుద్ధి చేయడం, ఆ నీటిని చెరువులు ఇతర వనరులకు పంపించి వాటిని పరిరక్షించుకోవచ్చు. అంతేకాకుండా భూగర్భ జలాలు కలుషితం కాకుండా.. పర్యావరణం, ప్రజారోగ్యంపై ఎలాంటి దుష్పలితాలు ఉండవు.
ఈ ఏడాది జలమండలికి అవార్డుల పంట పండింది. కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ గతేడాది నిర్వహించిన రెండో నేషనల్ వాటర్, శానిటేషన్ సమ్మిట్లో ఎక్సలెన్స్ అవార్డుతో పాటు పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) నిర్వహించిన బెస్ట్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్ విభాగంలో జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి లభించగా.. ఈ ఏడాది జలమండలికి మరో నాలుగు అవార్డులు వచ్చాయి. ఇందులో రెండు జాతీయ స్థాయి అవార్డులు రావడం విశేషం. తెలంగాణ వాటర్ కన్జర్వేషన్ అవార్డు – 2021, పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) అవార్డులు వరించాయి.
ప్యాకేజీ – 1 : రూ.613 కోట్లతో సరూర్నగర్, మహేశ్వరం, శంషాబాద్, హయత్నగర్, ఇబ్రహీంపట్నం, ఘట్కేసర్, కీసర మండలాల్లో 65.5 ఎంఎల్ సామర్థ్యంతో కొత్తగా 34 సర్వీసు రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం కొత్తగా 1571 కిలో మీటర్ల మేర పైపులైను వేయనున్నారు. ఫలితంగా సుమారు 4.36 లక్షల మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది.
ప్యాకేజీ – 2 : రూ.587 కోట్లతో రాజేంద్రనగర్, శామీర్పేట్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, పటాన్చెరు, ఆర్సీ పురం, బొల్లారం మండలాల్లో 71.5 ఎంఎల్ సామర్థ్యంతో 41 రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. కొత్తగా 1293 కిలో మీటర్ల పైపులైన్ వేస్తారు. సుమారు 1.97 లక్షల మంది లబ్ధి పొందనున్నారు.