మియాపూర్ , జూన్ 28 : రాష్ట్ర ప్రజలను కాపాడుకునేందుకు ప్రభుత్వం వ్యాక్సినేషన్ డ్రైవ్ను మరింత విస్తృతం చేసిందని కేవలం కేంద్రాల వద్దనే కాకుండా ప్రజల ముంగి టకూ తీసుకెళ్తుందని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ వెల్లడించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరినగర్ అసోసియేషన్ కార్యా లయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు, మాధవరం రోజాదేవితో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ..మొబైల్ టీకా సౌకర్యంతో అన్ని కాలనీలు, బస్తీలకు వ్యాక్సినేషన్ సులువుగా అందుతుందన్నారు. వినూత్నంగా మొబైల్ సేవలను అందుబాటులోకి తీసుకురావటం ద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతు న్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు రంగారావు, సంజీవరెడ్డి, ఎర్రగుడ్ల శ్రీనివాస్, జిల్లా గణేశ్, బాస్కర్రావు, ప్రతాప్రెడ్డి, కిశోర్, విద్యాసాగర్, సైదేశ్వర్, చంద్రికాప్రసాద్, ఖాజా తదితరులు పాల్గొన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆయా డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం కింద మంజూరైన చెక్కులను కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి, ఉప్పలపాటి శ్రీకాంత్లతో కలసి విప్ అరెకపూడి గాంధీ సోమవారం వివేకానందనగర్లోని తన నివాసంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సంక్షేమ పథకాలకు ఏమాత్రం లోటు రానివ్వకుండా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు రంగారావు, సంజీవ రెడ్డి, శ్రీనివాస్యాదవ్, జిల్లా గణేశ్, చిన్నోళ్ల శ్రీనివాసులు, ఆంజనేయులు, శ్రావణిరెడ్డి పాల్గొన్నారు.
కొండాపూర్, జూన్ 28: ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ అందేలా ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. సోమవారం చందానగర్ సర్కిల్ -21 పరిధిలోని సర్కిల్ కార్యాలయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మొబైల్ వ్యాక్సినేషన్ సెంటర్ను స్థానిక కార్పొరేటర్ మంజులారఘునాథ్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..మొబైల్ వ్యాక్సినేషన్తో టీకాలను ప్రజలకు సులభంగా చేరేలా చేస్తున్నామని వివరించారు. కరోనా కట్టడికి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అనంతరం టీకా తీసుకునేందుకు వచ్చిన వారిని సెంటర్ వద్ద కల్పించిన వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రోజాదేవి రంగారావు, దొడ్ల వెంకటేశ్ గౌడ్, నార్నె శ్రీనివాస్, ఉప్పలపాటి శ్రీకాంత్తో పాటు డిప్యూటీ డీఎంఓహెచ్ సృజన, ఏఎంహెచ్ఓ డాక్టర్ కార్తిక్, మాజీ కార్పొరేటర్ రంగారావు, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్రెడ్డి, ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షుడు గణేశ్, టీఆర్ఎస్ నాయకులు గొట్టి ముక్కుల పెద్ద భాస్కర్రావు, సైదేశ్వర్రావు, గురు చరణ్ దూబె, తదితరులు పాల్గొన్నారు.