నాంపల్లి క్రిమినల్ కోర్టులు, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : మొయినాబాద్ ఫామ్హౌజ్ డ్రగ్స్కేసులో ప్రధాన నిందితుడు నమిత్శర్మ, మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి ఆయన సోదరుడు రితేష్రెడ్డిలను మరో 5రో జుల పోలీసు కస్టడీకి అప్పగించాల ని దాఖలు చేసిన పిటీషన్పై సోమవారం వాదనలు ముగిశాయి. అదేవిధంగా బెయిల్ పిటీషన్పై కూడా వాదనలు పూర్తయ్యాయి.
ఇప్పటికే రెండు దఫాలుగా మూడు రోజుల చొప్పున ఆరురోజులపాటు శంషాబాద్ పోలీస్ స్టేషన్లో ముగ్గురు నిందితులను కస్టడీలో విచారించి పూర్తి సమాచారం సేకరించారని, కావాలని మరోసారి 5రోజులపాటు కస్టడీకి కోరుతూ అధికారులు పిటీషన్ దాఖలు చేయడం అప్రస్తుతమన్నారు. కస్టడీ సమయంలో నిందితులు సహకరించారని, 20రోజుల పాటు రిమాండ్ ఖైదీలుగా చంచల్గూడ జైలులో కొనసాగుతు న్నారని నిందితుల తరపు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మరోవైపు రితీష్రెడ్డి, రోహిత్రెడ్డి బ్యాంక్ ఖాతాల్లో అనేక అనుమానాస్పద లావాదేవీలు ఉన్నట్టు అధికారులు గుర్తించినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. ఇంకా లోతైన దర్యాప్తు చేపట్టాల్సి ఉన్నదని, నిందితులకు బెయిల్ మంజూరు చేసినైట్లెతే సాక్ష్యాధారాలు తారుమారయ్యే అవకాశమున్నద న్నారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వు చేస్తూ మంగళవారానికి వాయిదా వేశారు.