బేగంపేట్: పాటిగడ్డ, మోండామార్కెట్, కిమ్స్ సబ్స్టేషన్ పరిధిలలోని విద్యుత్ ఫీడర్లో తలెత్తిన సాంకేతిక లోపాలు, ట్రిమ్మింగ్లు కారణంగా శుక్రవారం వివిధ ప్రాంతాలలో విద్యుత్లో అంతరాయం ఉంటుందని విద్యుత్ ప్యారడైజ్ ఏడీఈ అధికారులు తెలిపారు.పాటిగడ్డ సబ్స్టేషన్ సింధి కాలనీ ఫీడర్ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు నల్లగుట్ట ధామ్స్ ఆసుపత్రి, మసీదు, ఎంజీ రోడ్డు, రాంగోపాల్పేట్ గార్డెన్స్ ఏరియాలలో పై విధంగా విద్యుత్ సరఫరా నిలిపి వేస్తారు.
మోండామార్కెట్ సబ్స్టేషన్ బాటా ఫీడర్ పరిధిలో మధ్యాహ్నం 12 నుంచి 2 గంట వరకు రాష్ట్రపతి రోడ్డు, ఓల్డ్ గాస్మండి, బోటని స్కూల్,బన్సీలాల్పేట్ ఏ,బీ,సి లైన్ ప్రాంతాలలో పై విధంగా విద్యుత్ నిలిపివేస్తారు.కిమ్స్ సబ్స్టేషన్ హెచ్డిఎఫ్సీ ఫీడర్ పరిధిలో మధ్యాహ్నాం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు టీఎస్ కోహిల్, అన్నపూర్ణ హోటల్, ఉషాకిరణ్ కాంప్లెక్స్, డిఎస్ఏ ఆఫ్లైన్, బాగ్రా ప్రాంతాల్లో విద్యుత్ ఉండదు. మైఫియర్ కాంప్లెక్స్ ఫీడర్ పరిధిలో సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు మై ఫియర్ కాంప్లెక్స్, కేపిఆర్ ఫ్యామిటి ట్రస్ట్, భరణి కాంప్లెక్స్, సింధి కాలనీ, ఆశోక బిల్డర్స్ ప్రాంతాల్లో పై విధంగ విద్యుద్ నిలిపివేస్తారు.