మేడ్చల్ కలెక్టరేట్, డిసెంబర్ 27 : జిల్లా స్థాయి యువజనోత్సవాలు 2023కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి బి.బలరామారావు ఒక ప్రకటనలో తెలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లోని ప్రజావాణి మీటింగ్ హాల్లో జనవరి 3న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 15 నుంచి 29 ఏండ్లు ఉండి, జిల్లాకు చెందిన ఆసక్తి గల అభ్యర్థులు నివాస, ఆధార్ కార్డు, జనన ధృవీకరణ పత్రం, లేదా ఎస్ఎస్సీ జిరాక్స్ కాపీలతో పాటు 3 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ప్రతాలను కలెక్టరేట్లోని జిల్లా యువజన, క్రీడల శాఖ కార్యాలయంలో నేరుగా లేదా DYSOMEDCHAL <\@>GMAIL.COM ద్వారా జనవరి 2వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని సూచించారు.
పోటీలు…
1. జానపద నృత్యం గ్రూప్ సభ్యులు 20 మంది గరిష్ఠంగా ఉండాలి.
2. జానపద సంగీతం గ్రూప్ సభ్యులు 10 మంది గరిష్ఠంగా ఉండాలి.
3. ఉపన్యాసం, వక్తృత్వం (హిందీ లేదా ఇంగ్లిష్) భాషలలో నిర్వహించిన అంశం నుంచి.
4. కబడ్డీ (బాలురు, బాలికలు) జిల్లా కబడ్డీ అసోసియేషన్ సెలెక్షన్, ట్రైల్స్ నిర్వహించి ఎంపిక చేస్తారు.