హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టి నియమితులయ్యారు. 2018 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఈయన.. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అడిషనల్ కలెక్టర్గా పని చేస్తున్నారు. బదిలీల్లో భాగంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు.
జిల్లా కలెక్టర్గా ఎఫ్ఏసీలో ఉన్న అమోయ్కుమార్ను రిలీవ్ చేస్తూ పూర్తి స్థాయి కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టికి బాధ్యతలు అప్పగించారు. అలాగే జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా ఎస్. స్నేహను నియమించారు. బల్దియాలో అదనపు కమిషనర్ (రెవెన్యూ, ట్రేడ్ లైసెన్స్)గా పనిచేసిన ప్రియాంక ఆలను భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్గా బదిలీ చేశారు.