హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో మరో నేపాలి గ్యాంగ్ భారీ దోపిడీకి పాల్పడింది. గచ్చిబౌలిలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో సుమారు నాలుగు నుంచి ఐదు కోట్ల విలువైన బంగారు, వజ్రాల ఆభరణాలతో ఉడాయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మురం చేశారు.
సీసీటీవీ పుటేజీ వివరాలతో నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. కాగా, నెల రోజుల క్రితమే సదరు వ్యాపారి నేపాల్కు చెందిన దంపతులను పని మనుషులుగా నియమించుకున్నట్లు సమాచారం. ఇటీవల వ్యాపారి కుటుంబం ముంబై వెళ్లి తిరిగి వచ్చేసరికి దోపిడీకి పాల్పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.