హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు స్కీం(Free bus schemem) ఆటో డ్రైవర్లపాలిట శాపంగా మారింది. గిరాకీలేక.. బతుకుదారి కనిపించక ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు(Committed suicide) పాల్పడుతుండటంతో వారి కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. చేసిన అప్పులు కట్టలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
తాజాగా చాంద్రాయణగుట్ట బార్కస్ ప్రాంతానికి చెందిన సాలెబిన్ అహ్మద్ మస్కతి(35) అనే ఆటో డైవర్(Auto driver) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం, అప్పులు కూడా ఎక్కువ కావడంతో అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి తట్టుకోలేక పోయాడు. దీంతో అతడు చెట్టుకు ఉరేసుకుని చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.