బోడుప్పల్/ ఘట్కేసర్, మార్చి16: బుధవారం బోడుప్పల్ ప్రాథమిక చికిత్స కేంద్రాన్ని కమిషనర్ బోనగిరి శ్రీనివాస్తో కలిసి బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా 12-14 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నేషనల్ వ్యాక్సినేషన్ డే సంధర్భంగా విధుల్లో ప్రతిభ కనబర్చిన నర్స్ సంధ్యారాణికి ప్రశంస పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్ సుజాతారావు, కార్పొరేటర్ కుంభం కిరణ్కుమార్రెడ్డి పాల్గొన్నారు.
ఘట్కేసర్ : పోచారం మున్సిపాలిటీ నారపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జాతీయ వ్యా క్సినేషన్ డే సందర్భంగా ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లను అధికారులు, ప్రజా ప్రతినిధులు సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఉత్తమ ఏఎన్ఎంగా అన్నోజిగూడ సెక్టార్ ఏఎన్ఎం నాగమణి, ఉత్తమ ఆశ వర్కర్లు భాగ్యలక్ష్మి, కవితలను శాలువాలు కప్పి సన్మానించారు. వైద్య శాఖ తరపున ప్రసంస పత్రాలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ యాదగిరి ఆధ్వర్యంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ కొండల్రెడ్డి, కమిషనర్ సురేశ్, కోఆష్షన్ సభ్యుడు అక్రం అలీ, వైద్య సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.