జంతువులపై మనుషులు ప్రేమను ప్రదర్శించాలని పిలుపునిస్తూ జంతు ప్రేమికురాలు స్టెల్లా నేతృత్వంలో పలువురు జలవిహార్ వద్ద గల డాగ్ పార్కులో ఆదివారం ప్రదర్శన నిర్వహించారు. రహమత్నగర్లోజరిగిన ఘటనను గుర్తు చేసుకుంటూ.. జంతువులు, మనుషులపై అమానుష దాడులు మానుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పాలక ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.