తెలుగుయూనివర్సిటీ : గుర్తు తెలియని ఓ వ్యక్తి రైలు కిందపడి మృతి చెందిన సంఘటన నాంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. హెడ్కానిస్టేబుల్ పి. నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం..
లింగంపల్లి-చందానగర్ రైల్వే స్టేషన్ల మధ్య సోమవారం సుమారు35-40సంవత్సరాల వ్యక్తి పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు సమాచారం వచ్చిందని తెలిపారు.తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా మృతదేహాన్ని ఉస్మానియా దవఖాన మార్చురీకి తరలించి భధ్రపరిచినట్లుగా తెలిపారు.
ప్రమాదవశాత్తుగా జరిగినట్లు భావిస్తున్నట్లుగా భావిస్తున్నట్లు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుని శరీరంపై లేత గులాబీ రంగు పుల్ షర్టు, బ్లూ జీన్స్ ప్యాంటు ధరించి ఉన్నాడని జీ. శ్రీనివాస్ అనే పేరుతో కుడి చేతిపై టాటూ తెలుగులో ఉందని వెల్లడించారు. వివరాలకు 040-23202238, 9000394635 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.