కాచిగూడ : అనారోగ్యంతో రైల్వేస్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు.ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తి (55) శివరాంపల్లి రైల్వేస్టేషన్ ప్లాట్ఫారం-2 చివర్లో గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉంటూ బుధవారం రాత్రి మృతి చెందాడు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతుని ఒంటిపై నీలి రంగు చొక్క, లేత నలుపు రంగు ప్యాంట్ ధరించి, ఎత్తు 5.4 ఉన్నట్లు పేర్కొన్నారు. కేసును కాచిగూడ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.