కాచిగూడ : విధులు నిర్వహిస్తున్న రైల్వే క్లర్క్పై గుర్తుతెలియని వ్యక్తి దాడి చేసిన సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిదిలో జరిగింది. ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం లాలాగూడ రైల్వే క్వార్టర్స్కు చెందిన హరోన్ భార్య రషీదా (49) వృత్తిరిత్యా డబీర్పుర రైల్వేస్టేషన్లో రైల్వే బుకింగ్ క్లర్క్గా పనిచేస్తుంది.
ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి సికింద్రాబాద్కు వెళ్లడానికి ఉందానగర్-సికింద్రాబాద్ డెమో రైలు(07056)కు టికెట్ ఇవ్వాలని కోరాడు.ఐతే అప్పటికే ప్లాట్ఫారంపై డెమో రైలు రావడంతో టికెట్ ఇవ్వడం కుదరదని, తరువాత వచ్చే రైలుకు ఇస్తానని క్లర్క్ నచ్చ చెప్పినప్పటికి ఆవేశంతో బుకింగ్ క్లర్క్ గదిలోకి దూసుకుపోయి క్లర్క్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.
క్లర్క్ రషీదా కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేసింది. గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ బిజీ ప్రసాద్ తెలిపారు.