అబిడ్స్, మార్చి 28 : ట్యాంక్బండ్పై దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ను హెచ్ఎండీఏ కార్యాలయంలో కలిసిన కురుమ సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా యెగ్గె మల్లేశం మాట్లాడుతూ.. రాష్ట్రంలో కురుమలకు సముచిత స్థానం కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో క్యామ మల్లేశ్, కొమరవెల్లి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ సేవల్లి సంపత్, రాష్ట్ర కురుమ యువత అధ్యక్షులు తూముకుంట అరుణ్కుమార్, కన్నా, బూరుగడ్డ నాగేశ్ తదితరులు పాల్గొన్నారు.